Yuvagalam: యువగళంతో లోకేశ్ సుదీర్ఘ యాత్రకు తొలి అడుగు వేశారు. కుప్పంలో అట్టహాసంగా యువగళం ప్రారంభించారు. ఆరంభంలోనే తారకరత్నకు గుండెపోటుతో కాస్త కలకలం చెలరేగింది. అనంతరం లోకేశ్ పాదయాత్ర ప్రస్థానం కొనసాగుతోంది.
లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు చేయకుండా ఉంటారా? మాజీ మంత్రి కొడాలి నాని ఎంట్రీ ఇచ్చేశారు. లోకేశ్ ను, యువగళంను ఏకిపారేశారు.
ఏ అర్హతతో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు కొడాలి. ఎమ్మెల్యేగా ఓడిన వాడు పాదయాత్ర చేయడం ఏంటి? లోకేశ్ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని నిలదీశారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకే ఉపయోగం లేదని తేల్చేశారు.
ఎన్టీఆర్ రక్తం నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు నాని. అలాంటి పార్టీని ఎన్టీఆర్ వారసుల నుంచి లాక్కునేందుకే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.