EPAPER

Chittoor Elephant attack: ముగ్గురిని చంపిన ఏనుగు.. ఆపరేషన్ గజ గజ..

Chittoor Elephant attack: ముగ్గురిని చంపిన ఏనుగు.. ఆపరేషన్ గజ గజ..
Elephant attack in chittoor

Elephant attack in chittoor(Breaking news in Andhra Pradesh):

అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఒంటరి ఏనుగు చిత్తూరులో బీభత్సం సృష్టించింది. రెండు రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ముగ్గురిని బలి తీసుకుంది. అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. అతికష్టం మీద ఆపరేషన్ గజ చేపట్టి.. ఆ మదపుటేనుగును బంధించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే…


చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతం. బుధవారం అంతా పొలాల్లో పని చేసుకుంటున్నారు. ఇంతలో అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఒంటరి ఏనుగు.. ఒక్కసారిగా పొలాల్లో పని చేసుకుంటున్న వారిపై దాడి చేసింది. దంపతులను చంపేసి.. తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.

గురువారం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి మరో మహిళను చంపేసింది ఆ ఏనుగు. మొదటిరోజే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం వల్లే మరో నిండు ప్రాంణం పోయిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించడంతో ఆందోళన విరమించారు.


అటు, మదపుటేనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ చేపట్టింది అటవీశాఖ. ననియాల ప్రాజెక్టు నుంచి తెచ్చిన రెండు కుంకీ ఏనుగుల సాయంతో ఆ ఏనుగును అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. రామాపురం దగ్గర చెరుకు తోటలో కనిపించిన ఏనుగుపై తుపాకీతో మత్తుమందు ప్రయోగించారు. మత్తులో ఉన్న ఏనుగును రెండు కుంకీ ఏనుగుల సహాయం తో అదుపులోకి తెచ్చారు. అనంతరం, తిరుపతి జూ పార్కు తరలించారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×