EPAPER

Kesineni Brothers: ఉప్పు నిప్పుగా కేశినేని బ్రదర్స్.. బాబు చొరవతో వర్గపోరుకు శుభంకార్డు

Kesineni Brothers: ఉప్పు నిప్పుగా కేశినేని బ్రదర్స్.. బాబు చొరవతో వర్గపోరుకు శుభంకార్డు

Kesineni Brothers: బెజవాడలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయాలు ఇప్పుడు చల్లారాయి. కేశినేని బ్రదర్స్‌ మధ్య నెలకొన్న పొలిటికల్‌ వార్‌ టీడీపీ అధినేత చంద్రబాబు చొరవతో.. ఉప్పు నిప్పుగా ఉన్న కేశినేని నాని, చిన్నిల మధ్య రాజకీయ విబేధాలు సద్దుమణిగాయి.


గత రెండేళ్లుగా కేశినేని బ్రదర్స్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ సాగుతుండటంతో బెజవాడ రాజకీయాలు కాకరేపాయి. సోదరులిద్దరూ ఎంపీ సీటు కోసం పట్టుపట్టడంతో ఇరువురి మధ్య పొలిటిల్‌ వార్‌ స్టార్ట్‌ అయింది. ఇదిలా ఉంటే.. బుద్దా వెంకన్న కారణంగానే మొదట్లో చంద్రబాబుకి నాని దూరం అయ్యారు. ఇదే అదునుగా దేవినేని ఉమ చిన్నిను రంగంలోకి దించడంతో రాజకీయ రగడ రాజుకుంది. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రసవత్తరంగా పొలిటికల్‌ వార్‌ నడిచింది.

అయితే.. మరికొన్ని రోజుల్లోనే ప్రజా క్షేత్ర పోరు ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలతో వీరి పంచాయితీ ముగిసినట్టయింది. మరల ఎంపీగా నానికి టికెట్‌ ఇస్తానని..పెనమలూరు గాని మైలవరం నుంచి కానీ చిన్నిని బరిలో దించుతానని హామీ ఇవ్వడంతో ఇద్దరు నేతలు కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ పంచాయితీ ముగియడంతో కేశినేని బ్రదర్స్‌ మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని.. కేవలం రాజకీయా డ్రామాలాడారని విమర్శిస్తున్నారు తోటి తెలుగు తమ్ముళ్లు.


Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×