Kadapa : కడప జిల్లా సిద్దవటం మండలం పాత టక్కోలి గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని అనేక మంది ప్రయివేటు ఆస్పత్రి ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పరీక్షలకే రూ.20 వేలు ఖర్చయిపోయిందని.. ప్రభుత్వ వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి తమను ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు.
ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని ఆ బిల్లులు భరించే స్తోమత లేదని.. తమని ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు. కొందరు ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారు.
మరికొందరు పూర్తిగా మంచానికి పరిమితమై ఆదుకొనే హస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజురోజుకి ఈ విష జ్వరాలు గ్రామంలో పెరిగిపోవడం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజలు ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి.