AP ECET Results 2024(Latest news in Andhra Pradesh): ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల అనంతరం 2024 సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ మేరకు అనంతపురం జేఎన్టీయూ Andhra Pradesh ECET 2024 Result విడుదల చేసినట్లు ప్రకటించింది.
ఎలా చెక్ చేసుకోవాలంటే..
cets.apsche.ap.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న అనతంరం ఫలితాలను ర్యాంక్ కార్డు రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈసెట్ ఫలితాల్లో అర్హత పొందిన విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
మే 8వ తేదీన జరిగిన ఏపీ ఈసెట్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 14 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ తరుణంలో జరిగిన పరీక్షకు 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష ద్వారా డిప్లొమా, పాలిటెక్నిక్, బీఎస్సీ(మ్యాథ్స్) డిగ్రీలు చదివిన విద్యార్థులకు ఈసెట్ పరీక్ష ఫలితాల ఆధారంగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయి. బీటెక్, బీఫార్మసీలో నేరుగా చేరవచ్చు.