ఆంధ్రప్రదేశ్లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పెట్టేది ఎవరో కాదు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అని ప్రచారం జోరుగా సాగుతోంది. సాయంత్రమే పార్టీపై కీలక ప్రకటన వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ.. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.
రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే.. ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచర చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చలు జరుపుతున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో.. ఇవాళ ఆయన ఏం ప్రకటన చేస్తారోనని ఏపీ పాలిటిక్స్లో ఉత్కంఠ నెలకొంది.