Janmabhoomi -2: ఏపీ వాసులకు శుభవార్త. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జన్మభూమి-2ను త్వరలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు.
త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని అందులో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మొదటిదశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Also Read: కందిపప్పు కోసం ఢిల్లీకి వచ్చాం: మంత్రి నాదెండ్ల
ఇదిలా ఉంటే.. చిలకలూరిపేటలో అన్న క్యాంటీన్, టిడ్కో ఇళ్ల నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. అన్ని వసతులతో కూడిన ఇళ్లను నిర్మిస్తామన్నారు. అదేవిధంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే హక్కు పత్రాలను జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. మార్చి చివరి వరకు అన్ని హంగులతో లబ్ధిదారులకు వాటిని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.