IMD Yellow Alert to AP Districts: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. అదే సమయంలో తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం..
ఉభయ గోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూల్, ఉమ్మడి విజయనగరం జిల్లా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణాతీరంలో అలలు ఉంటాయని తెలిపింది. నెల్లూరు సముద్ర తీరంలోనూ అలలు ఎగసి పడతాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని సూచించారు.