YCP Perni Nani : జనసేన అధికనేత పవన్కళ్యాన్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట మార్చే ఐకాన్గా పవన్ కళ్యాణ్ను చూపించవచ్చని అన్నారు. కార్యకర్తల దాడిపై పవన్ ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. ఎయిర్పోర్టులో జనసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారన్నారు. పవన్ చెబుతున్నట్ల విశాఖ గర్జనను వైసీపీ తలపెట్టడంలేదని.. జేఏసీ నిర్వహిస్తోందని అన్నారు.
మహిళా మంత్రి అని చూడకుండా ఆమెపై అసభ్యంగా మాట్లాడారు. దళిత మంత్రిపై చొప్పులు వేసి అవమానిస్తారా. పవన్ ర్యాలీలవల్ల జనం రోడ్లపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రులపై దాడులు చేస్తే.. చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, బీజేపీ, కమ్యునిస్టులు అందరూ కలిసి ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తామని మంత్ర పేర్ని నాని అన్నారు.