Honorarium to Junior Advocates: ఏపీలోని జూనియర్ న్యాయవాదులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం న్యాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేసేందుకు, అదేవిధంగా అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: ఏఆర్ డెయిరీ లారీ వివరాలు విడుదల.. ఎంతకి దిగజారావ్ జగన్ : టీడీపీ ఫైర్