AP E-Cabinet Meeting: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత పేపర్ లెస్ కేబినెట్ భేటీ నిర్వహించారు. 2014-19 కాలంలో టీడీపీ హయాంలో ఈ-కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాతి ప్రభుత్వం పేపర్ తో కూడిన కేబినెట్ సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ-కేబినెట్ విధానాన్ని పునరుద్ధరించింది.
ఈ-కేబినెట్ భేటీలో అజెండా నుంచి నోట్స్ వరకూ.. సమాచారాన్నంతా ట్యాబ్ లోనే ఉంచారు. దానిలో ఉంచిన సమాచారం మేరకే ఒక్కో అంశంపై మంత్రివర్గం చర్చించింది.
Also Read: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణస్వీకారం
ఏపీ ఈ-కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మళ్లీ పాతవిధానంలోనే టెండర్లను పిలిచేందుకు ఆమోదించింది. అలాగే కొత్త మద్యంపాలసీ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను రద్దు చేసింది.
రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించేందుకు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఓకే చెప్పింది. ప్రస్తుతం వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.