Gudiwada : కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. 10 వేల మందికి అన్నదానం చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ టౌన్లోని ప్రతి సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.
మరోవైపు.. గురువారం గుడివాడ పర్యటనకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గుడివాడ-ముదినేపల్లి రోడ్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు సమీపంలోనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
మరోవైపు.. గుడివాడలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి.