Heavy Rains Across Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలర్ట్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.
బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుండి 55 కి.మీ వేగంతో ఈదురగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పునరావాస ఏర్పాట్లు సిద్డం చేయాలని, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సెలవుల్లో ఉంటే వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.