E-Paper
Advertisement

Avinash Reddy : అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Avinash Reddy : అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
Advertisement

Avinash Reddy : వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ నేటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ ఎం. లక్ష్మణ్‌ వెకేషన్‌ బెంచ్‌ ముందు విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చింది.

వాదనలకు ఎంత సమయం పడుతుందని జడ్జి అడిగారు. కనీసం గంటపాటు వాదనలు వినిపిస్తామని సీబీఐ తరఫు లాయర్లు చెప్పారు. అటు అవినాష్ తరఫు న్యాయవాదులు సైతం గంటపాటు వాదనలు వినిపిస్తామని తెలిపారు. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటింది. దీంతో విచారణను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చేపడతామంటూ జడ్జి వాయిదా వేశారు. దీంతో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement

శుక్రవారం కచ్చితంగా అటోఇటో తేలిపోతుందని అంటున్నారు. ఇంతకీ అవినాష్‌కు బెయిల్ వస్తుందా? రాదా? సీబీఐ విచారణకు ఎంపీ వెళ్తారా? వెళ్లరా? వెళ్లకపోతే ఏం జరగుతుంది? వెళితే సీబీఐ అరెస్ట్ చేస్తుందా? ఇలా.. అవినాష్‌రెడ్డి బెయిల్, అరెస్ట్ పై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×