Harsha Kumar : తెలంగాణకు చెందిన షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు ఇవ్వకూడదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుండి గద్దె దింపాడానికి దళితులంతా సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. రాజమహేద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 8న రాజమహేద్రవరంలో దళిత సింహగర్జన సభను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
Harsha Kumar : తెలంగాణకు చెందిన షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వకూడదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దింపడానికి దళితులంతా సిద్దంగా ఉన్నారని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 8న రాజమహేద్రవరంలో దళిత సింహగర్జన సభను నిర్వహిస్తామని ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు అధికంగా జరిగాయని హర్షకుమార్ ఆరోపించారు. దళితులు నిరాదరణకు గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి దళితులపై అనేకసార్లు దాడులు జరిగాయన్నారు. బాధితులకు న్యాయం కూడా దక్కడం లేదని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం సామాజిక యాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికలలో తాను అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని హర్షకుమార్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ఎస్సీలను మోసం చేసిందని విమర్శించారు. వైసీసీ నేతలు ఎకరాల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉండే ముఖ్యనేతలు ఆ భూములను పంచుకుంటున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రంగా విమర్శించారు.