Harsha Kumar Comments on CM Jagan : వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూలేని విధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అమ్మఒడి పథకానికి సీఎం జగన్ తూట్లు పొడిచారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి అమ్మఒడి పథకానికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 27 ఎస్సీ పథకాలను తొలగించిందన్నారు.
జగన్కు వంద శాతం ఓట్లు వేసినా ఎస్సీలను మోసం చేశారని మాజీ ఎంపీ పేర్కొన్నారు. సీఎం విధానాలతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అందుకే ఫిబ్రవరి 11న వేమగిరిలో దళిత సింహగర్జన సభ నిర్వహిస్తామని మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. దళితులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొనాలని ఆయన కోరారు.