EPAPER

Godavari river news: గోదావరి ఉగ్రరూపం.. ముంపులో గిరిజన గ్రామాలు..

Godavari river news: గోదావరి ఉగ్రరూపం.. ముంపులో గిరిజన గ్రామాలు..
Godavari river flood news

Godavari river flood news(Andhra Pradesh today news): గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకూ ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 54.6 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.


ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ముంపు బారిన పడిన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన గ్రామాలు వరదలకు అల్లాడుతున్నాయి. ఏజెన్సీలోని 40 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. శ్రీరామగిరి, పోతవరం, జీడిగుప్ప, తుమ్మిళేరు, చినమట్టపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇవన్నీ మారుమూల గ్రామాలే. ఇక్కడ ప్రత్యేక పునరావాస కేంద్రాలు లేవు.


వరద బాధితులు సమీప కొండ ప్రాంతాల్లో గుడారాలు వేసుకున్నారు. 4 రోజులుగా అక్కడే బిక్కుబిక్కుమంటూ గడువుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంతో.. బాలింతలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×