Tirumala latest news today in telugu(AP updates) :టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు శ్రీవారికి భారీ విరాళం అందించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం కానుకగా ఇచ్చారు. ఆదివారం శ్రీవారిని సుధా నారాయణమూర్తి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ఈఓ ధర్మారెడ్డికి సుధా నారాయణమూర్తి దంపతులు బంగారు శంఖం అందించారు. ఈ శంఖాన్ని రెండు కేజీల బంగారంతో తయారు చేయించారు. శంఖం విలువ కోటిరూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా భారీ బంగారం కానుక స్వామివారికి సమర్పించి సుధానారాయణమూర్తి దంపతులు తమ భక్తిని చాటుకున్నారు.