YSRCP: వైసీపీ నేత దుట్టా రామచంద్రరావును మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కలిశారు. హనుమాన్ జంక్షన్ లోని దుట్టా నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు.
మొన్నటి వరకు యార్లగడ్డకు సపోర్ట్గా ఉన్నారు దుట్టా రామచంద్రరావు. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. ఈ చేరిక విషయంలో యార్లగడ్డకు దుట్టా మద్దతు ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో యార్లగడ్డకు మద్దతుగా నిలుస్తారని కూడా అంటున్నారు.
యార్లగడ్డతో మాట్లాడమంటూ.. ఎంపీ బాలశౌరిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఈ పరిణామాల మధ్య వారిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.