Ganja seized: ఏలూరు జిల్లా జిలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తనీఖీలు నిర్వహిస్తుండగా రాజమండ్రి నుండి వస్తున్న గూడ్స్ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని సీజ్ చేసి జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్కు తరలించారు.
Ganja seized: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి నుంచి వస్తున్న గూడ్స్ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని సీజ్ చేసి జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్కు తరలించారు.
రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు గూడ్స్ లారీలో గంజాయి లోడ్ చేసి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలో 11 గన్ని బ్యాగుల్లో ఉంచి 220 కేజీల గంజాయిని తరలిస్తున్నారని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.22 లక్షలు రూపాయలు ఉంటుందన్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు సహకరించిన మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఏలూరు జిల్లా అడిషినల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు వెల్లడించారు .