EPAPER

Former MLA Passed Away: ఏపీ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ మృతి

Former MLA Passed Away: ఏపీ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ మృతి

Former MLA Rammohan Rao passed away(Andhra news today): విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం ఎంపీ, చీపురపల్లి మాజీ ఎమ్మెల్యే కేంబూరి రామ్మోహనరావు(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు రామ్మోహనరావుకు ఐసీయూలో ప్రముఖ వైద్యుల సమక్షంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో బుధవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందారు.


టీడీపీ నుంచి 1985లో చీపురపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేంబూరి రామ్మోహనరావు.. 1989 వరకు కొనసాగారు. ఆ తర్వాత 1989లో టీడీపీ సభ్యుడిగా బొబ్బిలి నుంచి 9వ లోక్ సభలో ఘన విజయం సాధించారు.. పేదల అభివృద్ధి కోసం నిరంతరం తపనపడేవారు. అయితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Also Read: జగన్‌కు సంకేతాలు.. బొత్స ఓటమి ఖాయం! జీవీఎంసీ ఎన్నికల్లో..


1949 అక్టోబర్ 12న శ్రీకాకుళం జిల్లా పుర్లిలో జన్మించారు. ఈయన విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యాభ్యాసం అభ్యసించారు. 1974లో రుషిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చురుకుగా పనిచేసేవారు. అయితే, కెంబూరి మరణవార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులతోపాటు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×