Dharmavaram : ఏపీలోని ధర్మవరం నియోజకవర్గంలో.. టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్.. బీజేపీ నేత వరదాపురం సూరి మధ్య వివాదం నువ్వా నేనా అనే స్థాయికి చేరింది. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగా ఇరు వర్గాల మధ్య వివాదం ఇప్పుడు మరింత రేగింది.
సూరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మోదీ , అమిత్ షా, పురందరేశ్వరి ఫోటోలు.. కాకుండా చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలు వేయించారు. దీంతో ఆ ఫ్లెక్సీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీరామ్ వర్గం నేతలు చించివేశారు. ఇప్పుడు ఈ విషయం నియోజకవర్గం వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ ఘటనపై పరిటాల శ్రీరామ్ ఘాటుగా స్పందించారు. టీడీపీలోకి మళ్లీ రావాలనుకుంటే చంద్రబాబు, నారా లోకేష్ తోపాటు ధర్మవరం ప్రజలకు సూరి క్షమాపణ చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో పార్టీ స్థాయిని తగ్గించేలా పోస్ట్ పెట్టిన తన అనుచరుడిని చెప్పుతో కొట్టాలని శ్రీరామ్ స్పష్టంచేశారు. అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూరీకి హెచ్చరించారు.