Coronavirus: ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత రెండు రోజుల క్రితం వృద్ధాశ్రమంలోని ఓ వృద్ధుడికి కోవిడ్ లక్షణాలు ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేయ్యగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వృద్ధాఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో ఐదుగురికి పాజిటివ్గా తేలింది.
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేగింది. రెండు రోజుల క్రితం వృద్ధాశ్రమంలో ఒక వృద్ధుడికి కోవిడ్ లక్షణాలు ఉండటంతో కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వృద్ధాశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో మరో ఐదుగురికి పాజిటివ్గా తేలింది.
పాజిటివ్ గా నిర్థారణైన బాధితులను సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 743 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.