Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లక్షల విలువ చేసే ముడిసరుకు అగ్నికి ఆహుతయ్యింది. రాజా-చీపురుపల్లి రోడ్డులోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయల్ ఫ్యాక్టరీ ఉంది.
ఆదివారం రాత్రి పది గంటల సమయంలో అందులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధాన్యం నుంచి తవుడును ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది తేరుకునే లోపు ముడిసరుకు అగ్నికి ఆహుతయ్యింది.
కార్మాగారంలో సుమారు కోటి రూపాయల విలువైన పవువుల దాణా ఉంది. అందులో సగానికి పైగానే మంటల్లో కాలిపోయింది. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలకు ఈదురుగాలులు తోడు కావడంతో మరింత ఎగిసిపడ్డాయి.
ALSO READ: టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు!
ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ అధికారులు. దాదాపు లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అర్థరాత్రి వరకు మంటలు కొనసాగినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. దాణా నిల్వతోపాటు ఖాళీగా గోనె సంచలు ఉండడంతో నిప్పు రప్పులు రగిలి అగ్ని ప్రమాదం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెనుబాక సమీపంలోని సీతారామ ఆయిల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.#FireAccident #Srikakulam #AndhraPradesh #NewsUpdates #Bigtv pic.twitter.com/HZuQXHQSpz
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2024