విశాఖలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆస్పత్రిలో రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు రావడంతో ఆసుపత్రిలో పేషెంట్లు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ ఘటనలో సుమారుగా 40 మంది రోగులను అంబులెన్స్ లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు.
పోలీస్ కమీషనర్ రవిశంకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్కూట్ తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన షార్ట్ సర్య్కూట్ తో జరిగింది ..? ఇతరాత్రా కారణాలేమైనా ఉన్నాయా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు.
అగ్ని ప్రమాపక సిబ్బంది ఆసుపత్రి లోపల ఉన్న పేషెంట్లను బయటకు తీసుకరావడానికి లోపలికి వెళ్లారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆసుపత్రి మొత్తం పొగతో నిండిపోవడంతో రోగులు భయబ్రాంతులతో అర్తనాదాలు చేశారు. రెండవ అంతస్తులో భారీగా మంటలు రావడంతో భారీ క్రేన్ సహాయంతో లోపలికి వెళ్లి రోగులను తరలించారు.