E-Paper
Advertisement

Governor : బిశ్వభూషణ్ కు ఏపీలో వీడ్కోలు.. గవర్నర్‌ వ్యవస్థకు నిండుదనం తెచ్చారు: సీఎం జగన్

Governor : బిశ్వభూషణ్ కు ఏపీలో వీడ్కోలు.. గవర్నర్‌ వ్యవస్థకు నిండుదనం తెచ్చారు: సీఎం జగన్
Advertisement

Governor : గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు పలికింది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గవర్నర్‌ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని ప్రశంసించారు.

తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని బిశ్వభూషణ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనన్నారు. గవర్నర్‌ విద్యావేత్త, న్యాయ నిపుణులు, స్వాతంత్ర్య సమరయోధులని గుర్తు చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒడిశా బార్‌ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారని తెలిపారు. గవర్నర్‌ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రజలు, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

సీఎం జగన్‌తో తనకున్న అనుభవాలను గవర్నర్ పంచుకున్నారు. జగన్ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివన్నారు. గవర్నర్‌, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని వివరించారు. సీఎం జగన్‌ పేదలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రారంభంలో అడిగానని గుర్తు చేసుకున్నారు. దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్‌ చెప్పారని.. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని గవర్నర్ అన్నారు. వ్యవసాయ రంగంలో ఏపీ ముందుందని తెలిపారు. కరోనా సమయంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని ప్రశంసించారు. సీఎం జగన్‌ను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నానని గవర్నర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.

ఏపీ గవర్నర్‌గా మూడున్నర సంవత్సరాలపాటు బిశ్వభూషణ్ హరిచందన్ సేవలు అందించారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదీలయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించింది.

Advertisement

Gannavaram : గన్నవరంలో 144 సెక్షన్.. విజయవాడలో టెన్షన్..టెన్షన్.. పట్టాభి ఎక్కడ..?

Crime: వ్యభిచార దందాలో ఎస్‌ఐ తల్లి, తమ్ముడు.. ఏపీలో కలకలం

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×