అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కావలి తుఫాన్ నగర్ కు చెందిన భాస్కర్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధ భరించలేక అతని భార్య చిన్నమ్మ, కుమారుడు అవినాష్ (11)కి, కుమార్తే దీపిక (8)లకు బిర్యానీలో విషపు గుళికలు కలిపి తినిపించాడు. అనంతరం భాస్కర్ కూడా అదే తిన్నాడు.
బిర్యాని తిన్న వారంతా వాంతులు చేసుకోవడం స్థానికులు గుర్తించారు. వెంటనే బాధితులను దగ్గరలో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరు పిల్లలను నెల్లూరుకు తరలించారు. పోలీసులు భాస్కర్ ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతం ఆ నలుగురికి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. పిల్లలు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.