Anakapalli: అనకాపల్లి పట్నంలో విషాదం చోటుచేసుకుంది. తెనాలికి చెందిన కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11-12 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు కొడగలి శివరామకృష్ణ(40) తన భార్య, ముగ్గురు కుమార్తెలతో సైనేడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య మాధవి (38), కుమార్తెలు వేద వైష్ణవి(16), జాహ్నవి లక్ష్మి (13) మృతి చెందారు. చిన్న కుమార్తె కుసుమ ప్రియ (9) అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే వారి ఆత్మహత్యకు కారణమని స్థానికులు పోలీసులకు తెలిపారు.