EPAPER

Indrakiladri : దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం.. వారికి లేని ఆంక్షలు మాకెందుకు ?

Indrakiladri : దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం.. వారికి లేని ఆంక్షలు మాకెందుకు ?

Indrakiladri : విజయవాడ దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం రేపింది. 500 రూపాయల టికెట్‌ చెకింగ్‌ వద్ద నకిలీ పాసులతో వెళ్తున్న వారిని గుర్తించిన ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అడ్డుకున్న సిబ్బందిపై తల్లీకొడుకులు వాగ్వాదానికి దిగారు. ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ రాంబాబు పేరు చెప్పి సిబ్బందిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. సీన్‌లోకి పోలీసులు ఎంటర్‌ కావడంతో వివాదం సర్దుమనిగింది. నకిలీ పాసుల వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు ఆలయ సిబ్బంది


మరోవైపు ఇంద్రకీలాద్రిలో అధికారులు వర్సెస్‌ పాలకమండలిగా మారింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై పాలకమండలి సభ్యులు మండిపడుతున్నారు. దర్శన సమయంలో పాలకమండలి కుటుంబ సభ్యులను పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా కుటుంబాలతో దర్శనం చేసుకుంటున్నారని పాలకమండలి సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ వారికి లేని ఆంక్షలు తమకు మాత్రమే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇక అధికారుల తీరుపైనా భక్తులు గరంగరం అవుతున్నారు. 500 రూపాయలు వెచ్చించి ప్రత్యేక టికెట్లు తీసుకున్నా.. అమ్మవారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×