వంగవీటి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన వంగవీటి రాధా పెళ్లి పీటలెక్కబోతున్నారు. దీంతో వంగవీటి అభిమానుల్లో జోష్ నెలకొంది.
వంగవీటి రాధా పెళ్లెప్పుడు చేసుకుంటారని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు సైతం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది. వంగవీటి రాధా స్నేహితుడి బంధువుల అమ్మాయితో రాధా పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది.
ఈ నెల 19న నర్సాపురంలో వంగవీటి రాధా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లుపూర్తి అయ్యాయి. ఎంగేజ్మెంట్ అనంతరం సెప్టెంబర్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు కుటుంబ పెద్దలు.
నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై వంగవీటి రాధా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.