Eluru : ఏలూరు 10 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు కిడ్నాపర్లు. ఏలూరులో తంగెళ్లమూడి లక్ష్మీనగర్కు చెందిన రాజప్రోలు యశ్వంత్ (10) అనే బాలుడు డిసెంబర్ 12న ఆదివారం మధ్యా హ్నం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా ఆడుకోవ డానికి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి బాలుడిని తీసుకు వెళ్తున్నట్టు స్థానికులు గుర్తించారు.
బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఈలోగా ఓ వ్యక్తి మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. మూడు లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని ఫోన్ చేసి బెదిరించారు. బాలుడి తండ్రి రమేష్.. ఏలూరు మార్కెట్ యార్డులో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు.