Eluru : ఏలూరు జిల్లా అరిగిపల్లి మండల పరిధిలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి గ్రామంలో హ్యాపి వాల్యూ స్కూల్ లోని స్క్రాప్ యార్డులో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ మెటీరియల్ ను స్క్రాప్ కు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మరోవైపు ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తూ ఉండగా. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దర్ని నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కారణాలపై ఆరా తీస్తున్నారు.