Elephant Attack : చిత్తూరు జిల్లా గంగవరం మండలం, కొత్తపల్లి పంచాయతీ కేసీపెంట గ్రామంలో ఏనుగుల గుంపు దడ పుట్టిస్తోంది. రైతు రఘునాథ్ ఇంటిపై ఏనుగులు దాడి చేశాయి. అతని ఇంట్లో ఉన్న టీవీ, మంచం, ఇతర వస్తువులను చ ధ్వంసం చేశాయి. పక్కనే ఉన్న గడ్డివామును ఏనుగులు తోసివేయగా దాని కింద ఉన్న పాడి ఆవు నడుము విరిగి తీవ్రంగా గాయపడింది.
ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని బాధితులు ఆరోపించారు. “లక్షల అప్పు చేసి పంటలు వేసుకున్నాం. గజరాజులు ధ్వంసం చేయడమే కాక తమ ఇళ్లపైన కూడా దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాయి” అని ఆవేదం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.