EC Notices to Chandra Babu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైసీపీకి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. X తోపాటు ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పరిశీలించిన ఈసీ.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ చేసిన సోషల్ మీడియా పోస్టులను పరిశీలించామని, అవన్నీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఈఓ స్పష్టం చేశారు. వాటిన్నింటినీ ఆయా సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సీఈఓ వివరించారు.
Also Read: ప్రచారంలో టీడీపీ దూకుడు.. ప్రజాగళం పేరుతో మరిన్ని బహిరంగ సభలు..