ED Raids : ఏపీలోని పలు ఆసుపత్రుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఆసుపత్రిలో రికార్డులను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయి అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు.
విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి ఛైర్మన్తో సహా సిబ్బందిని ఈడీ ప్రశ్నిస్తోంది. అమెరికాలో వైద్యురాలుగా ఉంటూ విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని అక్కినేని మణి ప్రారంభించారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. గతంలో ఎన్నారై ఆసుపత్రి డైరెక్టర్గా అక్కినేని మణి వ్యవహరించారు. ఆమెను రహస్యంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. NRI మెడికల్ కాలేజ్ మేనేజ్ మెంట్ సీట్లు కింద కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీకి సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టింది.