ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో జరిగిన రుణాల మోసం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపటింది. నిందితులు.. రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డులను సేకరించారు. ఐడీబీఐ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డులపై భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు.
ఈడీ విచారణలో దాదాపు రూ.311.50 కోట్లను నిందితులు వారి సొంత ఖాతాల్లోకి మళ్లంచినట్లు తేలింది. అక్రమంగా పొందిన రుణాలతో సొంత వ్యాపారాలు చేసినట్లు.. ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది నవంబరు 29న ఆంధ్రప్రదేశ్, తెంగాణలోని ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ల్యాప్టాప్లు, హార్డ్డిస్క్లు, కీలక పత్రాలు స్వాధినం చేసుకున్నారు. నిందితులకు చెందిన స్ధిర, చరాస్తులు సీజ్ చేశారు.