ED IN SKILL DEVELOPMENT CASE : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఇవాళ రూ. 23.54 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. స్కిల్ స్కాంలో ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం జరిగాయని ఈడీ భావిస్తోంది. ఈ మేరకు విచారణ చేసి కేసు నమోదు చేసింది.
2014 నుంచి 2019 కాలంలో నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్’లో కుంభకోణం జరిగిందంటూ గత వైసీపీ సర్కారు విచారణ జరిపింది. ఈ కేసులోనే చంద్రబాబు అరెస్ట్ కూడా కావడం అప్పట్లోనే సంచలనంగా మారింది.
దాదాపు 52 రోజుల పాటు అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి రూ.23.54 కోట్లు సీమెన్స్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం గమనార్హం.
also read : పదేళ్లలో భారీ బిల్డింగ్స్ కట్టుకున్నారు.. అప్పుడు కనిపించలేదా.. కేటీఆర్ కు ఎంపీ సూటి ప్రశ్న