EC Orders Transfers Of Officers In AP: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. పలువురు కీలక అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. బదిలీ వేటు వేసిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది.
బదిలీ వేటు పడిన వారిలో ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ ఉన్నారు.
జిల్లా ఎన్నికల అధికారులలో రాజాబాబు( డీఈఓ కృష్ణా), గౌతమి (డీఈఓ అనంతపురం), లక్ష్మీషా (డీఈఓ తిరుపతి)పై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇక ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూర్ ఎస్పీ జోషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్లను ట్రాన్స్ఫర్ చేయాలని ఈసీ ఆదేశించింది.
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పాల రాజుపై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది.