AP: ఏపీలో ఇంటి దొంగల బండారం బట్టబయలైంది. నకిలీ ఫైళ్ల బాగోతాన్ని పసిగట్టంది ఏపీ సీఎం కార్యాలయం. ఏకంగా సీఎం కార్యదర్శుల పేరుతో నకిలీ ఈ-ఫైళ్లు సృష్టించారు కేటుగాళ్లు. తాము పెట్టని ఫైళ్లు కూడా రన్ కావడంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ఈ-ఫైళ్ల విషయంలో దిగువస్థాయి ఉద్యోగుల చేతివాటం ఉందని గుర్తించారు.
కార్యాలయంలో ఈ-లాగిన్, డిజిటల్ సిగ్నిచర్లు చోరీ చేసిన ఓ మాజీ ఉద్యోగి.. కార్యదర్శుల వద్ద పని చేసే ఇద్దరు దిగువస్థాయి ఉద్యోగులతో కుమ్మక్కై స్కాంకు తెరలేపాడు. వీరికి తోడు సీఎస్ కార్యాలయంలోని మరో దిగువస్థాయి ఉద్యోగి సహకరించడంతో నకిలీ ఈ-ఫైళ్ల సృష్టించి దర్జాగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న గంటల్లో కేటుగాళ్లను గుర్తించిన పోలీసులు.. ఇంకెవరెరు ఉన్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు.