Cm jagan: పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ..సీఎం జగన్ కాన్వాయ్పై రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైసీపీ నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 24న పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గోని సమీపంలోని హెలిప్యాడ్కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్పైకి గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్ డీఎస్పీ కారుపై పడింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి .. సీఎం జగన్ కాన్వాయ్పై రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైసీపీ నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా వెలుగులోకి వచ్చింది.
సీఎం జగన్ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 24న పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని సమీపంలోని హెలిప్యాడ్కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్పైకి గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్ డీఎస్పీ కారుపై పడింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న తర్వాత రెండు రోజులపాటు అప్పయ్యని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. చివరకు వైసీపీ నేతలు ఈ విషయంపై జోక్యం చేసుకుని అప్పయ్యను విడిపించారు. దివ్యాంగుడైన అప్పయ్య పెన్షన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా పింఛను మంజూరు కాకపోవడంతో విసుగు చెంది సీఎం కాన్వాయ్పైకి రాయి విసిరినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది.