Devieni Uma’s Brother Chandrasekhar Rao Died: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖరరావు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పాటు.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు.
తన సోదరుడు ఆస్పత్రిలో ఉండటంతో.. దేవినేని ఉమా మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉండి.. ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వచ్చారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలమైన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు తరలించారు. ఈరోజు సాయంత్రమే అంత్యక్రియలు జరగనున్నాయి. దేవినేని చంద్రశేఖరరావు మరణవార్త విన్న టిడిపి నేతలు.. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపి.. దేవినేని ఉమా ను ఫోన్ లో పరామర్శించారు. సోదరుడి మృతితో దేవినేని ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.