CM Jagan: విశాఖకు సీఎం జగన్ మకాం మార్చడం ఇప్పట్లో సాధ్యం కాదా? మరింత ఆలస్యం అవుతుందా? అధికార వర్గాలు ఇదే మాట చెప్తున్నాయి. సెప్టెంబర్లో విశాఖకు వెళ్లడం కష్టమేనని చెప్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో విశాఖకు వెళ్లే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
కోర్టు కేసులు క్లియర్ కావడానికి అక్టోబర్ వరకు సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏపీ హైకోర్టులో భారీగా బదిలీలు జరిగాయి. దసరా తర్వాత సుప్రీంకోర్టులో కీలకమైన మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అమరావతిపై స్పష్టమైన తీర్పు వచ్చాకే వైజాగ్కు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
మరోవైపు.. వైజాగ్ క్యాంప్ ఆఫీస్ పనులు పూర్తి కావడానికి మరో 2 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇలా పలు కారణాలతో సెప్టెంబర్లో విశాఖకు షిఫ్ట్ కావాలనుకున్న జగన్.. మరో మూడు నెలలు ఆలస్యంగానైనా వెళ్లితీరుతారని అంటున్నారు.