Srisailam dam news today(AP latest news) : ఓ వైపు శ్రీశైలం డెడ్ స్టోరేజ్. మరోవైపు ప్రకాశం బ్యారెజ్ గేట్లు ఎత్తివేత. ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి వరద లేకపోవడంతో.. శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. 210 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో ప్రస్తుతం 35 టీఎంసీల నీరు ఉంది. అంటే దాదాపు డెడ్ స్టోరేజ్.
ప్రసుత్త వర్షాభావ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో పడ్డారు రైతులు. జురాల నుంచి ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమైనా.. ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో శ్రీశైలం జలాశయంపై ఆధారపడిన రాయలసీమ రైతాంగం తీవ్ర ఆందోళనల్లో ఉన్నారు.
మరోవైపు ఖమ్మం, నల్లగొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు.. ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తుతోంది. మున్నేరు, వైరా, కట్టలేరు, మధిర వాగుల నుంచి వరదనీరు కృష్ణా నదిలో కలుస్తోంది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 16 గేట్లను అడుగు మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.