CM Jagan in volunteers Vandanam Program(AP news today telugu): సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్తు.. సేవలందిస్తున్న వలంటీర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ల సేవలను ప్రశంసించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగ వారు చేస్తున్న సేవలను అభినందించారు.
రాష్ట్రంలో చాలా మార్పు కనిపిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. తన పాలనకు వాలంటీర్లే సాక్ష్యం అన్నారు. వారంత మరో రెండు నెలలు కష్టపడాలని కోరారు. తన పాలనలో ప్రతి ఎన్నికలకు విజయం వాలంటీర్లే కావాలని చెప్పారు. జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుడితే.. వాలంటీర్లు వ్యవస్థ ప్రజలకు సేవ చేసేందుకే పుట్టిందన్నారు. నేడు ప్రతి పథకం, ఇంటింటికి అందుతున్నాయి అంటే అందుకు కారణం వాలంటీర్లే అన్నారు.
Read More: తిరుపతిలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి
ఇదేవిధంగా మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటే ఆంధ్రరాష్ట్రంలో పేద వాడి భవిష్యత్తు మారుతుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ.. ఇతర రాష్ట్రాల హామీలను కలిపి కిచిడి చేసి ఒక మేనిఫెస్టో తయరు చేస్తారని ఎద్దేవా చేశారు.
ప్రజల కష్టలకు సమాధనంగా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు. గతంలో ఏ మంచి చేయని చంద్రబాబు ఇప్పుడు రూ.1.26లక్షల కోట్లు ఇస్తాను అని చెప్పడం మరో మోసం అన్నారు. చంద్రబాలు కలిసిన ఇతర పార్టీల కూటమిని ఎదుర్కునేందుకు అందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పేద వాడి భవిష్యత్తు మారాలంటే మళ్లీ వైసీపీతోనే సాధ్యం అని జగన్ అన్నారు.