BigTV English
Advertisement

Jagan : కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ .. లబ్ధిదారులు ఎంతమందంటే.?

Jagan : కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ .. లబ్ధిదారులు ఎంతమందంటే.?

Jagan : వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ నగదు జమ చేశారు. జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మందికి రూ.87.32 కోట్ల ఆర్థికసాయాన్ని అందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి జగన్‌ నగదు జమ చేశారు.


బాల్యవివాహాలను నివా­రిం­చడంతోపాటు పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు, ముస్లిం కోసం వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థికసాయం అందిస్తోంది.

కల్యాణమస్తు, షాదీ తోఫాల కింద సాయం పొందే లబ్ధిదారులకు పదో తరగతి ఉత్తీర్ణతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వధువుకు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలని నిర్దేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.


వివాహమైన 30 రోజుల్లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను ధ్రువీకరిస్తారు. ఏటా ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్‌లో లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాల్లో, అదే కులంలోని యువకులను వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.1.20 లక్షలు అందిస్తారు. మైనారిటీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు, వారు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు ఇస్తారు. దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల ఆర్థికసాయం అందిస్తారు.

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×