TDLP Meeting By Cm Chandrababu : తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 18న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరుకానున్నారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు పెంపుదల గురించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చర్చలు చేయనున్నారని తెలుస్తోంది. ఇక పార్టీలో పదవులు లేకుండా పార్టీ కోసం క్యాడర్ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, పదవులు దక్కించుకున్న నాయకుల పనితీరుపైనా విశ్లేషణలు చేయనున్నారట.