CM Chandrababu: బెజవాడపై ప్రకృతి కన్నెర్ర జేసింది. నగరం ఎటువైపు నుంచి చూసినా చుట్టూ వరద నీరు కనిపిస్తోంది. ఎత్తైన భవనాల్లో సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. వరద పరిస్థితి గమనించిన సీఎం చంద్రబాబునాయుడు రాత్రంతా మేల్కొని ఉన్నారు.
వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో వరద ప్రవాహం గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అక్కడ జరుగుతున్నపనులేంటి? ఆ ప్రాంతాల్లో ఎవరెవరు చూస్తున్నారు? బాధితులకు అందించిన సాయం గురించి ఆరా తీశారు.
అధికారులు చెప్పినదంతా విన్న సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, సోమవారం ఉదయం మరోసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విజయవాడలో సహాయక చర్యలు వేగవంతమ య్యాయి. కేంద్రంతో మాట్లాడిన తర్వాత పవర్ బోట్స్ విజయవాడకు చేరుకున్నాయి. ఒకవైపు ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోంది. బాధితులను బోట్లపై ఇళ్ల నుంచి బాధితులను బయటకు తీసుకొస్తున్నారు.
ALSO READ: విజయవాడ వరదలు మూడు లక్షల మందిపై ప్రభావం..
అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బందిపడకుండా హోటళ్లలో ఉంచాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. బాధితుల కోసం కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అధికారులంతా బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో సహాయచర్యలను పరిశీలిస్తున్నారు.
పునరావాస కేంద్రాలకు వెళ్లేవారికి దుస్తులు కూడా ఇవ్వాలని ఆదేశించారు సీఎం. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిళ్లను బాధితులకు అందజేస్తోంది ప్రభుత్వం. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా రెడీ చేసిన ఆహారాన్ని అందజేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి.
వరద సహాయక చర్యలపై సీఎం రివ్యూ. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు గారు సమావేశం. ఆహారం, బోట్లు ఎంతవరకు వచ్చాయనే సమాచారంపై ఆరా. సింగ్నగర్ లో ప్రస్తుత పరిస్థితి, సహాయంపై సీఎం సమీక్ష. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు జిల్లాలోని వరద ప్రాంతాల్లో సాగిన సీఎం పర్యటన#APGovtWithFloodVictims… pic.twitter.com/nfN03YUpW9
— Telugu Desam Party (@JaiTDP) September 2, 2024
100 ఏళ్లలో రెండో అతిపెద్ద వరద ప్రవాహం
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం
2009 అక్టోబర్ 5న 10,94,422 క్యూసెక్కుల వరద.
ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కులు దాటిన వరద ప్రవాహం.
కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.
మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేత.#HeavyRains… pic.twitter.com/j7Cb8M2McB
— BIG TV Breaking News (@bigtvtelugu) September 2, 2024
విజయవాడ: బుడమేరు ప్రాంతంలో వరద బాధితులకు ఆహారం, మంచినీళ్లు, పాలు అందజేత.#HeavyRains #Vijayawada #AndhraPradesh #NDRF #NewsUpdates #Bigtv pic.twitter.com/ikmdmZIhgw
— BIG TV Breaking News (@bigtvtelugu) September 2, 2024