EPAPER

CM Chandrababu: ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. బోట్లు వదిలింది వైసీపీ వాళ్లే.. చంద్రబాబు

CM Chandrababu: ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర..  బోట్లు వదిలింది వైసీపీ వాళ్లే.. చంద్రబాబు

CM Chandrababu with flood victims and farmers: ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు వైసీపీ కుట్ర చేసిందని , అందుకే బోట్లు వదిలారని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏలూరు జిల్లాలో వరద బాధితులు, రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలకుల పాపాలు.. మనపాలిట శాపాలుగా మారాయన్నారు.


ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు వైసీపీ నాయకులు బోట్లు వదిలి పెను ప్రమాదం చేసేందుకు ప్రయత్నించారన్నారు. 50 టన్నుల బరువు ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయన్నారు. ఒకవేళ ప్రకాశం బ్యారేజీ కూలిపోయినట్లయితే లంక గ్రామాల పరిస్థితి ఎలా ఉండేదోనని ఆందోళన చెందారు. ఆ బోట్లతోనే గతంలో అక్రమ ఇసుక వ్యాపారం చేశారన్నారు.

వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్‌లు వస్తున్నాయని, వరదల సమయంలో వైసీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. గతంలో బుడమేరు గండ్లు పూడ్చకపోవడం వల్లే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చిందని, గత ప్రభుత్వం బుడమేరులో పూడిక తీయలేదని గండ్లు పూడ్చలేదని ఆరోపించారు.


అంతకుముందు, ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Related News

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకో తెలుసా?

Balineni Srinivasa Reddy: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని? ముహూర్తం ఫిక్స్!

Mumbai actress case: కాదంబరీ జెత్వానీ కేసులో ఓ ఐఏఎస్.. అప్రూవర్‌గా మారేందుకు ఐపీఎస్ ప్రయత్నాలు..

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Big Stories

×