Pawan Kalyan Speech in Chilakaluripet’s Prajagalam Meeting: రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ప్రజాగళం సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించనున్నట్లు తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయిని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం అని పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం జగన్పై విమర్శల వర్షం గుప్పించారు. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి అని అన్నారు. ఏపీకి రావాల్సిన కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని వాపోయారు.అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏపీ నుంచి వెళ్లిపోయాయని తెలిపారు.
అమరావతికి అండగా ఉంటానని చెప్పడానికే ప్రధాని మోదీ వచ్చారని జనసేనాని పేర్కొన్నారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని పవన్ తెలిపారు.