EPAPER

Chicken Rates: దడపుట్టిస్తున్న కోడి.. కిలో చికెన్ రూ.300..

Chicken Rates: దడపుట్టిస్తున్న కోడి.. కిలో చికెన్ రూ.300..

Chicken Rates in Andhra PradeshChicken Rates In Andhra Pradesh(Local news Andhra Pradesh): ఆంధ్ర ప్రదేశ్‌లో చికెన్ రేట్ కొండెక్కింది. కేజీ చికెన్ ధర రూ.300 పలుకుతుంది. దీంతో సామాన్యులు చికెన్ తినలేని పరిస్థితి ఎర్పడింది. మార్చి వరకు కోడి కొండమీదనే కూర్చోనున్నట్లు తెలుస్తోంది.


కోళ్ల ఉత్పత్తి దారుణంగా పడిపోవడమే చికెన్ రేట్లు పెరగడానికి కారణమని వ్యాపారులు తెలిపారు. కోడి మాత్రమే కాదు కోడి గుడ్డు కూడా కొండెక్కి కిందకు దిగనంటోందని తెలుస్తోంది. గుడ్డు ధర రూ.5 పైనే నడుస్తోంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కూడా చికెన్ రేట్లు పెరగడానికి ఒక కారణమని తెలుస్తోంది.

ఇటీవలే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెద్ద మొత్తంలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చికెన్ రేట్ సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగింది.


Read More: Drugs: మత్తు.. చిత్తు.. నగరంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ ..

కాగా కార్తీక మాసంలో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.120 నుంచి రూ.130 చొప్పున అమ్మాల్సి వచ్చిందని వ్యాపారులు వాపోయారు. దీంతో ఫారం యజమానులకు తీవ్ర నష్టాలు వచ్చాయి. అందుకే కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్లు పలువురు వ్యాపారులు పేర్కొన్నారు. దాని ఫలితంగా కోళ్ల కొరత ఏర్పడి.. చికెన్ రేట్ పెరగడానికి దారి తీసింది.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×